మండల ఏ ఓ అధికారిని ఆధ్వర్యంలో గ్రామసభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మండలంలోని భద్రవరం గ్రామంలో విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య సమీక్షించుటకు మండల వ్యవసాయ అధికారిని
బి.జ్యోతి ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ నిర్వహించినారు.ఇందులో భాగంగా మండలంలో ఇప్పటికే ఐదువేల మంది రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది రిజిస్టర్ చేయడం జరిగిందని,భద్రవరం రైతులు 200 మంది ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలియజేశారు.పెండింగ్ ఉన్న రైతులు పేర్లు లిస్టులో చదివి వినిపించారు.విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారానే పీఎం కిసాన్,అన్నదాత సుఖీభవ,ఇన్సూరెన్స్,పంట నష్టం, ధాన్యం కొనుగోలు వంటివి జరుగుతాయని రైతులకు తెలియజేశారు.పొలం ఉండి గ్రామంలో లేని రైతులకు ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తామని ఈ విషయం తమ బంధువులకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వేసవిలో విత్తుకునే అపరాల విత్తనాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కూనపు రెడ్డి సుబ్బారావు,గ్రామ నాయకులు జిగటాపు సూరిబాబు,వీఆర్వో బాలరాజు,సత్య అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్,సింహాద్రి అగ్రికల్చర్ అసిస్టెంట్,బందెల బాబ్జి,ఏనుగంటి అప్పారావు,రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///