మక్తల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం

మనన్యూస్,నారాయణ పేట:ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏ.రవి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన మున్సిపాలిటీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీనియర్ నేతలు కట్టా సురేష్ కుమార్ గుప్తా, మండల అధ్యక్షులు గణేష్ కుమార్, బి.చంద్రకాంత్ గౌడ్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని, అందుకు తగినట్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు ఇప్పటినుంచి సంసిద్ధం కావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనట్టుగా అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందేందుకు చర్యలు చేపడుతుందని అన్నారు. గత పదేళ్ళలో కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదని, ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందాయని తెలిపారు. ప్రతి బూత్ లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించి, పార్టీ బలోపేతం దిశగా కృషి చేసి, రాబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా సమిష్టి కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించడం జరిగింది, ఈ కార్యక్రమంలో నాయకులు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు