గొంతిన సురేష్ ఔదార్యంతో జర్నలిస్టులకు పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీలు

65 మంది ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ సభ్యులకుఇన్సూరెన్స్ పాలసీలు

Mana News :- ప్రత్తిపాడు (మన న్యూస్ ప్రతినిధి): ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,లంపకలోవ సొసైటీ మాజీ అధ్యక్షుడు గొంతిన సురేష్ పోస్టు ఆఫీస్ నందు లభించే బజాజ్ యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కు రుసుము చెల్లించి జర్నలిస్టుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు.సుమారు 65 మంది జర్నలిస్టులకు గొంతిన సురేష్ ఇన్సూరెన్స్ రుసుము చెల్లించారు.ఈ సందర్భంగా గొంతిన సురేష్ మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యలని లేవనెత్తి పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తూ,నిత్యం ఎంతో ఒత్తిడి జీవితం అనుభవించి ప్రజలకు అవసరమైన సమాచారం . అందిస్తూ,ప్రజా సమస్యలను,పాలకుల తప్పులను ఎత్తి చూపి సమాజ అభ్యుదయానికి జర్నలిస్టులు చేస్తున్న కృషి , అభినందనీయమని అన్నారు.జర్నలిస్టులకు తన వంతుగా ప్రమాద సమయంలో వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా పోస్టల్ ఇన్సూరెన్స్ అందించేందుకు నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు.జర్నలిస్టులకు పోస్టల్ అకౌంట్ తో పాటు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిన గొంతిన సురేష్ కి ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఘన సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా పోస్టల్ సిబ్బంది పోస్టల్ ఇన్సూరెన్స్ యొక్క ఉపయోగాలను వివరించారు.ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు గంటా మహాలక్ష్మి రావు (చంటిబాబు),మండల టిడిపి పార్టీ అమరాది వెంకటరావు,సీనియర్ నాయకులు యాళ్ల జగదీష్, కొమ్ముల కన్నబాబు,పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!