ఘనంగా టీడీపీ నేత లక్కమనేని మధు జన్మదిన వేడుకలు

పలుచోట్ల అన్నదానం – ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

Mana News :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ,మన న్యూస్…. తెలుగుదేశం పార్టీ నాయకులు లక్కమనేని మధుబాబు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. టీడీపీ శ్రేణులు, అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల నడుమ అత్యంత వేడుకగా ఈ వేడుకలు నిర్వహించారు. తొలుత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని వేదపండితులు ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత నేరుగా పీవీ రోడ్డులోని కార్యాలయానికి చేరుకున్న మధుబాబుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇక్కడ భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. పట్టణంలోని వెల్లం పాలెం, బహుదూర్ పేట, రామసేతు వంతెన తదితర ప్రాంతాల్లో జరిగిన అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. సాయంత్రం గాలి గోపురం సమీపంలో మిత్రులు, శ్రేయోభిలాషులు అభిమానుల మధ్య భారీ కేక్ కటింగ్ నిర్వహించారు.ఇదిలా ఉంటే అభిమానులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అందించారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చరవాణీ ద్వారా మధుబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, జనసేన నాయకులు, పలువురు స్థానిక టీడీపీ నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కన్నలి ప్రతాపరెడ్డి, కన్నలి ప్రవీణ్ రెడ్డి, శ్రీకాళహస్తి జడ్పిటిసి కాపీరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటాచలం, మాజీ కౌన్సిలర్ రవీంద్రబాబు, ఉన్నం ప్రసాద్, నవీన్, వంశి, సోము, భార్గవ్, దశరథ, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!