

Mana News :- గొల్లప్రోలు నవంబర 13 మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే నియమించబడ్డ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా తుమ్మల రామస్వామి{బాబు}ను నియమించడం పట్ల జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం పెద్దాపురంలో గల జనసేనపార్టీ కార్యాలయంలో తుమ్మల రామస్వామి{బాబు}ను జ్యోతుల శ్రీనివాసు కలిసి ముందుగా తుమ్మల రామస్వామి{బాబు}ను శాలువాతో సత్కరించి,పూవ్వుబోకెను అందించి,జ్ఞాపకం అందజేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ 1994 సంవత్సరం నుంచి రాజకీయాలలో ఉంటున్నా మహోన్నతమైన వ్యక్తి, నిబద్ధతతో,పట్టుదలతో,నీతినిజాయితీతో అంచెంచలగా రాజకీయంగా ఎదిగినవ్యక్తి తుమ్మల రామస్వామి{బాబు}. సామాన్యుల పట్ల,మెట్ట ప్రాంత రాజకీయాల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి,2024 ఎన్నికలలో కూటమిపార్టీల కాకినాడ పార్లమెంటు అభ్యర్ది,అసెంబ్లీ అభ్యర్థుల గెలుపుకు తనదైనపాత్రను పోషించారు.ఇటువంటి సేవలందిస్తున్న తుమ్మల రామస్వామి సేవలను గుర్తించి జనసేనని కొణిదెల పవన్ కళ్యాణ్ తుమ్మల . రామస్వామిని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ{కుడా} చైర్మన్ గా నియమించడం ఎంతో సంతోషకరమైన విషయమని, ఈప్రాంతం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి తుమ్మల రామస్వామి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అనేక సేవలను ప్రజలకు అందుబాటులో తేవడం జరుగుతుందిని జ్యోతుల శ్రీనివాసు అన్నారు.జ్యోతుల శ్రీనివాసు వెంట దుర్గాడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటి చెర్మన్ శాఖ నాగేశ్వరరావు{నాగు}, .దుర్గాడ గ్రామపంచాయతి సభ్యులు వెలుగుల సతీష్,దుర్గాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరేంట్స్ కమిటి మాజీ చెర్మన్ కందా శ్రీనివాసు,దుర్గాడ మాజీ ఎంపీటీసీ సభ్యులు కొమ్మూరి కృష్ణ,కోప్పుల చక్రదర్,జ్యోతుల వాసు,కాపారపు వెంకటరమణ {పూసలు},మేడిబోయిన శ్రీను,జ్యోతుల గోపి,కొలా శివ,శాఖ సురేష్,సఖినాల లచ్చబాబు తదితరుల ఉన్నారు.