

విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం తలపెట్టిన ప్రజా పోరు
పాచిపెంట నవంబర్11( మన న్యూస్ ):=
పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కార్యక్రమం విజయవంతం ప్రతి ఒక్కరూ కదలి రావాలని సిపిఎం పార్టీ ఇంటింటికి ప్రచారం చేస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ వాళ్లు పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈతమానువలస గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మండల నాయకులు మంచాల శ్రీనివాసరావు లావుడు జెన్ని గౌరమ్మ ప్రజా సంఘాల నాయకులుగౌరునాఇడు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను గాలికి వదిలేసి అంబానీ అదాని కార్పొరేట్లు సేవలో మునిగిపోయిన మోడీ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు కదలాలని అన్నారు ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే నాయకుడు అనే జమిలి ఎన్నికలు పద్ధతుల్ని తీసుకురావడం రాజ్యాంగానికి విరుద్ధమని దీనిని ప్రజలంతా వ్యతిరేకిస్తున్న మోడీ ఏకపక్షంగా వివరించడం దుర్మార్గమని అన్నారు జాతీయ ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఒకపక్క నిత్యవసర వస్తువులు ధరలు పెరిగిపోయి నిరుద్యోగం పెరిగిపోయి రైతాంగానికి గిట్టుబాటులేక వ్యవసాయరంగా వదిలి వలసలు పోయే పరిస్థితి ఏర్పడిందని ధరలు అదుపు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని సామాన్య ప్రజలు బతకడం చాలా కష్టంగా ఉందని అన్నారు మహిళలపై చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని దీనిపై చట్టాలు కఠినంగా తీసుకోకపోవడం వలన మహిళలకు భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అమలు చేసి ఇచ్చిన హామీ అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని అన్నారు. స్మార్ట్ మీటర్లు పేరుతో కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై మరింత భారాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు పై సమస్యలు పరిష్కారం కోసం ప్రజలంతా కదిలి రావాలని ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాచి పెంట మండలం ఈత మానవలస మెట్టవలస అమ్మ వలసి పెద్దవలస పద్మాపురం కర్రివలస తదితర గ్రామాలలో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేయడం జరిగింది 14న జరిగిన కార్యక్రమం జయప్రదం చేయాలని భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం నాయకుడు కోరాడ ఈశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజలు పాల్గొన్నారు.