నిల్వ మాంసం విక్రయాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి

మనన్యూస్,గొల్లప్రోలు:నిల్వమాంసం,చనిపోయిన కోళ్ల మాంసం వ్యాపారులు యదేచ్చగా విక్రయాలు సాగిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ సోకి వేలాది కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాలలో మృతి చెందిన కోళ్లను స్థానిక మార్కెట్లో విక్రయిస్తున్నారన్నారు.చనిపోయిన గొర్రెలు,మేకలను మాంసంగా విక్రయిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.అలాగే రోజుల తరబడి ఐస్ బాక్సులలో నిల్వచేసిన చేపలను సైతం అమ్ముతున్నారన్నారు.నిల్వ మాంసం,చేపల కారణంగా పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు.పశు వైద్యాధికారి పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నాయని ధ్రువీకరించిన మేకలు గొర్రెలను మాత్రమే మాంసంగా విక్రయించవలసి ఉందని అయితే కొంతమంది వ్యాపారులు నగర పంచాయతీకి సంబంధించిన స్టాంపులు తామే తయారు చేయించుకుని మేకలపై వారే ముద్రిస్తున్నారన్నారు.అధికారులు ఇకనైనా స్పందించి నిల్వ మాంసం,చేపల విక్రయాలను నిరోధించాలని సుబ్బారావు కోరారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..