ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నూరు భాషు కాలీషావలి కి ఘన సన్మానం

పదవీ విరమణ శుభాకాంక్షలు -నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ. ఆర్.ఎ) స్టేట్ కమిటీ సభ్యులు

Mana News :- ఒంగోలు. నగరానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నూరు భాషు కాలీషా వలి నీ సంతపేట ఆయన నివాసంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ స్టేట్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మక్కెన సురేంద్రబాబు మాట్లాడుతూ
కాలీషా వలి. చిన్నతనము నుండి మంచి నడవడిక , క్రమశిక్షణతో ప్రాథమిక విద్యను ఆర్. జె హిందు పాఠశాలలో , మాధ్యమిక విద్యను గోరంట్ల వెంకన్న ఎయిడెడ్ పాఠశాలలో స్వగ్రామంలోనే అభ్యసించి, ఒంగోలులోని వెలిది వెంకటేశ్వర్లు అండ్ మంగమ్మ డిగ్రీ కళాశాలలో ఇంటర్, డిగ్రీలు చదివి గిద్దలూరులోని ఆదర్శ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో వృత్తి విద్య అయిన బి.ఇడి పూర్తికావించినారు. అటు పిమ్మట హైదరాబాదు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి ఏ. ఎస్సి (గణితం)లో పట్టభద్రులైనారు. బాలలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయ వృత్తి లో 04.08.1989 న స్పెషల్ టీచర్ గా పెదగంజాం, పట్టపు పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేరి సెకండరీ గ్రేడ్ టీచర్ గా పలువురి ప్రశంసలు అందుకున్నారు. 02.11.1990 నుండి 9. 5. 2000 వరకు వెలిగండ్ల మండలం వెదుళ్ళ చెరువు, ఇంకొల్లు మండలం కొణికి, భీమవరం, చిన్నగంజాం మండలం సంతరావూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహించారు. పదోన్నతి పై 10.05.2000 న కొరిశపాడు మండలం రావినూతల జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూలు అసిస్టెంట్ (గణితము) గా బాధ్యతలు స్వీకరించి పమిడిపాడు, కారుమూడి వారి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 13.01.2021 వరకు పనిచేసినారు. ఎందరో విద్యార్థులను తమ బోధనలతో గణితంలో నిష్ణాతులుగా తీర్చిదిద్ది ఉత్తమ ఉపాధ్యాయునిగా అసమాన కీర్తిని గడించి గడించినారు. అటుపట 14.01.2021న ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతిని పొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొనకొండ (ఆర్.ఎస్) లో చేరి తదుపరి పామూరు మండలం కంబాలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తమ విశిష్ట సేవలు అందించి, ప్రస్తుతం చిన్నగంజాం మండలం రాజు బంగారు పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ పాఠశాల పరిపాలన మరియు విద్యా సంబంధమైన విషయాలలో తమదైన చెరగని ముద్ర వేసి 31.01.2025న పదవీ విరమణ చేసినారు అని వీరి విశిష్ట సేవలు అమోఘమైనవని కొనియాడినారు . నేషనల్ యాక్టివ్ రిపోర్టర్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ ఖాదర్ వలీ మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన ఈ 36 సంవత్సరాల సుదీర్ఘకాలములో క్రమశిక్షణ అంకిత భావములే ఊపిరిగా సహోపాధ్యాయులు యెడల స్నేహశీలిగా మచ్చలేని చంద్రునిగా మెలిగిన తీరు అందరికీ ఆదర్శమని అన్నారు. 2019లో అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఐ.ఏ.ఎస్. చేతుల మీదగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కాలీషా వలి గారి ప్రతిభకు గీటురాయి అని అన్నారు . ఈ కార్యక్రమంలో స్టేట్ నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మక్కెన సురేంద్రబాబు, స్టేట్ సెక్రటరీ షేక్ ఖాదర్ వలి తో పాటు పి. వెంకటేశ్వర్లు, కోటయ్య, రాకేష్ , ప్రకాష్, మొదలగువారు కాలేషా వలి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసినారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…