

మన న్యూస్,నెల్లూరు: నెల్లూరు నగరం,సండే మార్కెట్ దగ్గర హెచ్ వై పి ఎస్ వి సిల్క్ క్లాత్ షోరూం ముక్కోటి పర్వదినాన శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ప్రారంభించినారు.సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నెల్లూరు నగరం నడిబొడ్డున హెచ్ వై పి ఎస్ వి సిల్క్స్ ప్రారంభించినందుకు చాలా సంతోషం అని అన్నారు.ఈ షోరూమ్ లో నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి.ఇలాంటి షోరూమ్ లు ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలో ఏర్పడతాయని ఆశిస్తున్నాను. సింహపురి ప్రజలు సంక్రాంతి పండగను ఈ షోరూం వస్త్రాలతో జరుపుకోవాలని కోరుచున్నాను అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ పెరుమాళ్ రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ జీవీ రమణ, బంధుమిత్రులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.