మన న్యూస్:గొల్లప్రోలు లోని పదవ తరగతి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలనే మంచి ఆశయంతో యూటీఎఫ్ చే ప్రచురితమైన ఎంతో విలువైన ఎస్ ఎస్ సి మోడల్ టెస్టు పేపర్స్ గొల్లప్రోలు లోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు మరియు బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు చేబ్రోలు ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్వర్గీయ గొల్లపల్లి నాగేశ్వరరావు గారి కుమారుడు గొల్లపల్లి బాబీ తిరుపతి రావు 30,000 ₹ విలువైన పుస్తకాలను వితరణ చేశారు ఈ సంవత్సరం కూడా ప్రతీ సబ్జెక్టు లోను 70 నుంచి 80 మార్కులు వచ్చేలా తయారు చేసిన వివిధ జిల్లాల్లోని యు టి ఎఫ్ కి విద్యార్థులు,తల్లిదండ్రులు ధన్యవాదములు తెలిపారు మరియు అటువంటి విలువైన పుస్తకాలు విద్యార్థులకు అందించిన మన గొల్లపల్లి బాబీ గారికి యు టి ఎఫ్ గొల్లప్రోలు మండలం తరపున ధన్యవాదాలు గత సంవత్సరం ఇదేవిధాంగా 20,000₹ విలువైన పుస్తకాలు వితరణ చేసి గొల్లపల్లి బాబీ గారిని పలువురు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *