filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0; hdrForward: 6; shaking: 0.000000; highlight: 1; algolist: 0; multi-frame: 1; brp_mask: 8; brp_del_th: 0.0156,0.0000; brp_del_sen: 0.1500,0.0000; delta:1; bokeh:1; ispap:1; papproctime: 2026:08:20 11:21:36; module: photo;hw-remosaic: false;touch: (0.2085187, 0.53314483);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 147.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 33;

మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ )
నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం నిజాంసాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా పండరి మాట్లాడుతూ దేశ అభివృద్ధికి, యువతకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు సాంకేతిక రంగం అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు సంకు లక్ష్మయ్య, నందాస్ మోహన్, వడ్ల బ్రహ్మం, కాంగ్రెస్ నాయకులు గుర్రపు శ్రీనివాస్, రాములు, బంగ్లా ప్రవీణ్, గాండ్ల రమేష్, వెంకట్, దత్తు, చిరంజీవి, సాయిలు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *