

మనన్యూస్:కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల నివాసి అయినా పొట్టి గారి శివప్రసాద్ 22 సంవత్సరాలు 31దావతు చేసుకొని ఎక్కువగా మద్యం సేవించి మద్యము మత్తులో అతను ఏమి చేస్తున్నాడో తెలియక నేను చెరువులో ఈతకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి ఇంటికి రాలేని సమయంలో కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లి చూడగా అతను కనిపించక పోయేసరికి చెరువులో అతని గాలించగా అతను ఒడ్డున ఉన్నాడని గమనించి అతను పూర్తిగా స్పృహ కోల్పోయాడని అనుకోని వెంటనే అతని కామారెడ్డి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యుల దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నరేష్ తెలిపారు.