తూల గిరి శ్రీరామ క్షేత్ర ఆలయానికి రెడ్నం పుష్పలత రూ.101116 విరాళం పచ్చారి సూర్య ప్రసాద్ రూ.10,000 విరాళం దాతలను ఘనంగా సన్మానించిన కమిటీ సభ్యులు

మన న్యూస్: ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని తూల గిరి కొండపై నిర్మాణంలో ఉన్న శ్రీరామ క్షేత్ర ఆలయానికి ప్రత్తిపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ రెడ్నం భాను మూర్తి జ్ఞాపకార్ధం వారి సతీమణి పుష్పలత 100116 రూపాయల నగదును విరాళంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకి అందచేశారు.అలాగే ప్రముఖ వ్యాపారి పచ్చారి సూర్య ప్రసాద్ 10000 రూపాయలు విరాళంగా ఇవ్వడంతో పాటు క్షేత్ర అభివృద్ధికి పూర్తిగా సహకారం అందిస్తానని కమిటీ సభ్యులకి తెలియచేశారు.ఈ సందర్బంగా వారిని ప్రముఖ పురోహితులు,ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్ఛరణతో శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్బంగా రెడ్నం రాజా,తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఈ ఆలయానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చి సహకరించాలన్నారు.అలాగే ప్రముఖ వ్యాపార వేత్త అనంతపల్లి శ్రీనివాస్,సరళ దంపతుల ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి వారిచే డిసెంబర్ 12న జరిగిన శ్రీరామ పాదకుల పూజ విజయవంతం చేసిన ప్రతి రామ భక్తులకి కృతజ్ఞతలు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అనంతపల్లి శ్రీనివాస్,చాట్ల పుష్పారెడ్డి,పత్రి రమణ,గోగుల బుజ్జి,మదినే నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం