అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్ళాలి అధికార సిబ్బంది కి ఎంపీపీ ప్రమీల హితవు

మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 19: పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట గ్రామ పంచాయతీలలో అధికారులు,సిబ్బంది కలసి సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లాలని పాచిపెంట ఎంపీపీ బి ప్రమీల హితవు పలికారు. గురువారం నాడు మండల పరిషత్తు సమావేశ భవనంలో ఎంపీడీవో బి జే పాత్రో అధ్యక్షతన సచివాలయం,పంచాయితీసిబ్బందికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ ప్రమీల మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి రూపొందించిన 9 ప్రధాన సూత్రాలను ఆమె వారికి తెలియజేశారు.1.పేదరికం లేని మెరుగైన జీవనోపాధి కలిగిన గ్రామం కావాలన్నారు. 2. ఆరోగ్యవంతమైన గ్రామము కావాలని కోరారు.3.బాలహిత గ్రామము,4.నీరు సమృద్ధిగా కలిగిన గ్రామము,5. పరిశుభ్రతతో పాటు పచ్చదనం కలిగిన గ్రామము,6. స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు కలిగిన గ్రామము.7. సామాజికంగా సుస్థిరమైన గ్రామము. 8.సుపరిపాలన కలిగిన గ్రామం, 9. మహిళా హిత గ్రామము కావాలని కోరారు. పై 9 లక్ష్యాలు ఆయా పంచాయతీల్లో కలిగిన అన్ని శాఖలతో సమన్వయంతో పరిపూర్ణంగా అమలుపరిచినట్లయితే పూర్తిస్థాయిలో ఆయా పంచాయతీలు అభివృద్ధి చెందుతాయని ఆమె ఆశా భావం వ్యక్తం చేశారు.అలాగే 2025-26 సంవత్సరాలుగాను ఆయా పంచాయతీల్లో ప్రణాళికలు తయారు చేసేవిధoగా రూపొందించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంపీడీవో మాట్లాడుతూ మనమంతా కలిసికట్టుగా సమన్వయంతో గ్రామపంచాయతీలు అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని మీరంతా సహకరించాలని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరారు. జిల్లా అధికారుల ఆదేశానుసారం మనమంతా చక్కగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వారితోపాటు పంచాయతీ విస్తరణ అధికారి మల్లేశ్వరరావు, పలువురు సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

  • Related Posts

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్‌ 18 : భక్తులకు దేవాదాయశాఖపై నమ్మకం భగవంతునిపై ప్రగాఢ విశ్వాసం కలిగించేలా దేవాదాయశాఖ అధికారులందరూ భగవంతుని సేవలో చిత్తశుద్ధితో పనిచేస్తూ, ఆలయాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం ఉదయం…

    నెల్లూరులో వైభవంగా కాప్స్ రాక్స్ కార్తీక మాస వనభోజనాలు

    మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 16:నెల్లూరులో గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతిష్టాత్మకంగా కాప్స్ రాక్స్ ఆర్గనైజేషన్లో జరుగుతున్న వనభోజనాల కార్యక్రమం ఆదివారం బలిజ భవన్లో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ ,వారి సతీమణి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    • By RAHEEM
    • November 18, 2025
    • 2 views
    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

    • By RAHEEM
    • November 17, 2025
    • 7 views
    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్