

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రదయిని అయినా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు రైతులకు యాసంగి సీజన్ క గాను ,మొదటి విడత నీటిని ప్రధాన కాలువకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత్రావుతో కలిసి సంజీవ్ పంతులు ఆధ్వర్యంలో పూజ నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి శుక్రవారం విడుదల చేశారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద యాసంగి సీజన్లో ఒక లక్ష 25 వేల ఎకరాల్లో పంటలు వేస్తున్న దృష్ట్యా వేసిన పంటలకు ఆరు విడతలగా నిజాంసాగర్ నీటిని అందిస్తామని ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు.నిజాంసాగర్ ప్రాజెక్టులో యాసంగి సీజన్ కు తో పాటు, వర్షాకాలం పంటలకు కూడా నీరు అందించే విధంగా నీళ్లు ఉండడంతో రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా నిజం సాగర్ నీటిని పొదుపుగా వాడుకొని పంటలు పండించుకోవాలని మంత్రి వెల్లడించారు. నిజామాబాద్ పట్టణ వాసులకు తాగునీరు అందించడంతోపాటు, ఈ యాసంగి సీజన్లో నిజాంసాగర్ ఆయకట్టు కింద ఒక లక్ష 25 వేల ఎకరాలకు సాగుదీరు ఆరు విడతలుగా అందిస్తామని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి వెల్లడించారు. అనుకున్న సమయానికి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకొని, ప్రధాన కాల్వకు నీటిని విడుదల చేసే గేట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసి నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షులు మల్లికార్జున్, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,నాయకులు, నీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.