నీటిని పొదుపుగా వాడుకోవాలి.నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి 

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రదయిని అయినా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు రైతులకు యాసంగి సీజన్ క గాను ,మొదటి విడత నీటిని ప్రధాన కాలువకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత్రావుతో కలిసి సంజీవ్ పంతులు ఆధ్వర్యంలో పూజ నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి శుక్రవారం విడుదల చేశారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద యాసంగి సీజన్లో ఒక లక్ష 25 వేల ఎకరాల్లో పంటలు వేస్తున్న దృష్ట్యా వేసిన పంటలకు ఆరు విడతలగా నిజాంసాగర్ నీటిని అందిస్తామని ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు.నిజాంసాగర్ ప్రాజెక్టులో యాసంగి సీజన్ కు తో పాటు, వర్షాకాలం పంటలకు కూడా నీరు అందించే విధంగా నీళ్లు ఉండడంతో రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా నిజం సాగర్ నీటిని పొదుపుగా వాడుకొని పంటలు పండించుకోవాలని మంత్రి వెల్లడించారు. నిజామాబాద్ పట్టణ వాసులకు తాగునీరు అందించడంతోపాటు, ఈ యాసంగి సీజన్లో నిజాంసాగర్ ఆయకట్టు కింద ఒక లక్ష 25 వేల ఎకరాలకు సాగుదీరు ఆరు విడతలుగా అందిస్తామని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి వెల్లడించారు. అనుకున్న సమయానికి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకొని, ప్రధాన కాల్వకు నీటిని విడుదల చేసే గేట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసి నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షులు మల్లికార్జున్, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,నాయకులు, నీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.

  • Related Posts

    పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

    మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

    800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి