సమిష్టి కృషితోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిరుపయోగకరంగా ఉన్న మరుగుదొడ్లను పరిశీలించిన మంత్రిమోడ్రన్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశం

మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 6:
నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రజా మరుగుదొడ్లను శనివారం రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ,ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డితో కలిసి పరిశీలించారు.రోడ్డు సమస్యను మంత్రి దృష్టికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి తీసుకెళ్లారు.. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి రోడ్డు పనులకు ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని మోడరన్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు….. మరుగుదొడ్ల సమస్యతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని సురేష్ రెడ్డి తన దృష్టికి తీసుకుని వచ్చారని తెలిపారు. ఆ ప్రాంతాన్ని అధికారులతో వచ్చి పరిశీలించామని మోడ్రన్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.. ఆర్టీసీ ప్రయాణికులతో పాటు స్థానికులు కూడా వీటిని ఉపయోగించుకోవచ్చన్నారు.ఆర్టీసీ బస్టాండ్ సందులో రోడ్డు నిర్మాణానికి ఎస్టిమేషన్ ఇవ్వాలని కోరినట్లు మంత్రి అన్నారు. కూటమిది ప్రజా ప్రభుత్వమని సమిష్టి కృషితోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్నామని మంత్రి నారాయణ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కమిషన్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,స్థానిక టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం