మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్ ఐ శివకుమార్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని సుల్తానగర్ గ్రామ శివారులో గల గుల్ గెస్ట్ హౌస్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ఎస్ ఐ శివకుమార్ పర్యవేక్షించారు.వాహనదారుల వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్,వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,ఇన్స్యూరెన్స్ మరియు పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి పత్రాలను పరిశీలించారు.మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారా అనే దానిపై కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ ఐ శివకుమార్ మాట్లాడుతూ… రోడ్లపై సురక్షితంగా ప్రయాణం జరగాలంటే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి.మద్యం సేవించి వాహనం నడిపేవారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాభిక్ష ఉండదు.అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తాం అని హెచ్చరించారు.అలాగే వాహనదారులు రాత్రి వేళల్లో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని,వేగం నియంత్రణలో ఉంచాలని, హెల్మెట్ లేదా సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.వాహనానికి సంబంధించిన అన్ని ధృవపత్రాలు — డ్రైవింగ్ లైసెన్స్,రిజిస్ట్రేషన్, ఇన్స్యూరెన్స్,పొల్యూషన్ సర్టిఫికెట్,ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని,వాహనంలో సాంకేతిక లోపాలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించారు.
ఎస్ ఐ శివకుమార్ ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని,భద్రత మన చేతుల్లోనే ఉందని తెలిపారు. ఎస్ఐ వెంట పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర