అవినీతి అధికారులపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీరియస్

విద్యుత్, టౌన్ ప్లానింగ్, రెవిన్యూ అధికారులతో సమీక్ష సమావేశం ఆధారాలతో సహా బయటపెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి


మన ధ్యాస, నెల్లూరు రూరల్, అక్టోబర్ 23:పేద మధ్యతరగతి ప్రజలను లంచాల కోసం వేధిస్తున్న అవినీతి అధికారులు సిబ్బంది పట్ల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు రావడంతో ఆయన విద్యుత్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన అనేక అంశాల గురించి సంబంధిత శాఖల అధికారుల సిబ్బందిని ప్రశ్నించారు. మధ్యతరగతి ప్రజలను లంచాల కోసం ఎందుకు వేధిస్తున్నారని నిలదీశారు. మీ వైఖరి మారకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో ఆధారాలతో సహా అయిన బయట పెట్టడంతో కొంతమంది అధికారులు, సిబ్బంది గుటకలు మింగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు ఈ తప్పు మరోసారి చేయమని దీనిని సరిదిద్దుకుంటామని ఎమ్మెల్యే ముందు చెప్పారు.ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ…… పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని, రోజువారి కష్టం చేసేవారిని కూడా లంచాల కోసం వేధించడం సరికాదన్నారు. తనకు వచ్చిన ఫిర్యాదులు ఆధారాలను లెటర్ రూపంలో పెడితే మీ ఉద్యోగాలు కూడా ఉండమని హెచ్చరించారు. అలాగే మీడియా కూడా ఇస్తే మీ భవిష్యత్తు ఏమవుతుందని నిలదీశారు. తొలి హెచ్చరికగా జాగ్రత్తగా పని చేసుకోవాలని, ఇవి పునరావృత్తమైతే అంతే కఠినంగా చర్యలు ఉంటాయన్నారు. మొత్తానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివిధ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం వాడి వేడిగా సాగింది.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?