రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గరం గరం* కోటి 50 లక్షలు ఇరిగేషన్ స్థలాన్ని గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్

మన ధ్యాస,నెల్లూరు రూరల్ ,అక్టోబర్ 23:కోటి యాభై లక్షల ఇరిగేషన్ స్థలం.. ప్రభుత్వ స్థలాలను కూడా అప్పనంగా రికార్డులను మార్చి అక్రమాలు చేసి తమ కాసుల కక్కుర్తి కోసం రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారుల మాయాజాలం… రిజిస్ట్రేషన్ కోసం జిల్లా కేంద్రంలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళితే జలగ పీడిచ్చినట్టు పీడిస్తున్న వైనం.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి పేద, మధ్యతరగతి ప్రజలు అనేకమంది ఫిర్యాదులు… అయ్యా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ఇది పరిస్థితి.. మీరు స్పందించండి… ఒక్క డాక్యుమెంట్ కోసం వేలాది రూపాయలు లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి.. లేకపోతే అనేక కొర్రీలు వేస్తున్నారు… పేదల ఎమ్మెల్యేగా మీరే న్యాయం చేయాలి అంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అనేకమంది వేడుకున్నారు. కొన్ని డాక్యుమెంట్ల కోసం లక్షల రూపాయలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి.నెల్లూరు మద్రాస్ బస్టాండ్, స్టోన్ హౌస్ పేట రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సంబంధించి వరుసగా అనేక మంది ఫిర్యాదులు రావడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. పేద మధ్యతరగతి ప్రజలను లంచాల కోసం జలగల్లా పీల్చి చేస్తున్న కొంతమంది అధికారులు సిబ్బంది, వ్యవహారంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధారాలతో సహా అనేక సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వ స్థలాలను అప్పనంగా రికార్డులను తారుమారు చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్న ఘటనలకు సంబంధించి ఫిర్యాదులు కూడా ఆయనకు ఉన్నాయి. దీంతో జిల్లా రిజిస్ట్రార్ ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు తన కార్యాలయంలో జరిగే సమీక్ష సమావేశానికి హాజరుకావాలని కోటంరెడ్డి సమాచారం అందించారు. మొత్తానికి నెల్లూరు మద్రాస్ బస్టాండ్ , స్టోన్ హౌస్ పేట రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను సమీక్ష సమావేశంలో కోటంరెడ్డి ఆధారాలతో సహా నిలదీసి హెచ్చరిక జారీ చేయనున్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?