చవలమూడి మేఘన ను కిమ్స్ హాస్పిటల్ లో పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

నెల్లూరు అక్టోబర్ 21 : మన ధ్యాస న్యూస్ :///

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలై కిమ్స్ లో చికిత్స పొందుతున్న, చవలమూడి మేఘన ను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ నెల్లూరులోని కిమ్స్ లో మంగళవారం పరామర్శించారు. వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం, దూబుగుంట గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన, చవలమూడి బాబు, మమత దంపతులు వారి కుమార్తెలు, వైభ, మేఘన, ద్విచక్ర వాహనంపై, కలిగిరికి ఆధార్ నమోదు నిమిత్తం వచ్చి తిరుగు ప్రయాణంలో దూబు గుంట కు వెళుతుండగా, మార్గమధ్యంలోని తెల్లపాడు క్రాస్ రోడ్డు వద్ద, గత బుధవారం సాయంత్రం బోర్ వెల్స్ లారీ ఢీకొనడంతో ప్రమాదంలో చవలమూడీ బాబు, (34)మమత,(27)మరియు వారి కుమార్తె వైభ(8) ప్రమాద సంఘటనలోనే అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. మేఘనకు చేయి నుజ్జు నుజ్జు కావడం తోపాటు తీవ్ర గాయాల పాలయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే ఆత్మకూరులో చికిత్స పొందుతున్న మేఘనకు అత్యవసర చికిత్స అందించాలని నెల్లూరులోని కిమ్స్ వైద్యులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా తెలియజేశారు. హుటాహుటిన ఆత్మకూరు నుండి మేఘనను నెల్లూరుకు తరలించారు. కిమ్స్ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కిమ్స్ లో మేఘనను పరామర్శించి ఎమ్మెల్యే వారి బంధువులతో మాట్లాడుతూ పాపకు అన్ని విధాలుగా అండగా నిలుస్తానని తెలిపారు. ప్రభుత్వం ద్వారా మృతుల కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తానన్నారు. అదేవిధంగా బోర్ వెల్స్ లారీ ద్వారా ఇన్సూరెన్స్ క్లైమ్ చేయించి, ఇన్సూరెన్స్ వచ్చేలాగా చూస్తాను అని తెలిపారు. పాపను జాగ్రత్తగా చూసుకోవాలని బంధువులకు తెలిపారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?