దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయాలపై కఠిన నిబంధనలు,,2 టౌన్ సిఐ వేణుగోపాల్ రెడ్డి హెచ్చరిక..!!

నెల్లూరు అక్టోబర్ 19 : (మన ధ్యాస న్యూస్ )://

దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ అజిత వేజండ్ల, ఏ ఎస్పీ, డీఎస్పీ సూచనలు, ఆదేశాల మేరకు నెల్లూరు రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రజలకు ముఖ్య సూచనలు జారీ చేశారు.ఈ సందర్బంగా రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా రక్షణకు ప్రాధాన్యతనిస్తూ దీపావళి సందర్భంగా బాణాసంచా అమ్మకాలు, నిల్వ, సరఫరా విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు.అనుమతి లేని టపాసుల తయారీ, నిల్వ, విక్రయాలు నేరమని, అలాంటి వారిని గుర్తించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి వ్యాపారి, తయారీదారు తప్పనిసరిగా లైసెన్స్‌ పొందాలి. ప్రతి టపాసు షాపు మధ్య కనీసం 10 అడుగుల దూరం ఉండాలి. ప్రతి దుకాణంలో 200 లీటర్ల నీరు, ఇసుక డ్రమ్స్, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌ తప్పనిసరిగా ఉంచాలి అని తెలిపారు.తయారీ కేంద్రాలు, నిల్వ గోడాముల వద్ద శిక్షణ పొందిన కార్మికులు మాత్రమే పనిచేయాలని, పిల్లలను టపాసుల తయారీ లేదా విక్రయంలో పాల్గొననివ్వకూడదని హెచ్చరించారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.పోలీస్, ఫైర్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తాయని, ఎక్కడైనా ఉల్లంఘనలు గమనించినట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.ప్రజలు తమ పిల్లల భద్రత, ఆస్తుల రక్షణ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్‌ నియమాలను కచ్చితంగా పాటించాలని నెల్లూరు రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సూచించారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?