వింజమూరు,అక్టోబర్ 04 :(మన ధ్యాస న్యూస్ )://
పధ్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నేడు శనివారం వింజమూరు లోని స్థానిక వి ఆర్ ఫంక్షన్ ఫ్లాజాలో ఉదయగిరి నియోజకవర్గస్థాయి,సమీక్షా సమావేశం ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జీ పందిటి అంబేద్కర్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశానికి ముఖ్య అతిధిలుగా ఎమ్మార్పిస్ జాతీయ నాయుకులు జిల్లా ఇన్చార్జీ మంద.వెంకటేశ్వర రావు మాదిగ,ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగలు పాల్గొని, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 30 సంవత్సరాలు పాటు అలుపెరుగనిపోరాటం చేసి నేడు సాధించి ఎన్నో ఫలాలు జాతికి అంకితం చేసిన మహాజన నేత నెల్లూరు గడ్డపై అడుగు పెట్టే లోపల వేలాది మంది మాదిగలు తరలి వచ్చే విధంగా ఎమ్మార్పీఎస్ నాయకులు ఎవరికి వారు సిద్దం కావాలని ఈనెలలో జరగబోయే మండల స్థాయి సమావేశాలు ప్రతీ మాదిగ బిడ్డ విజవంతం చేయాలని వారు కోరారు అదేవిదంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగలు మాట్లాడుతూ ఈనెల 19 న మందకృష్ణ మాదిగ పర్యటన జయప్రదం చేయాలని ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నాయకులు ఎవరికీ వారు జయప్రదం చేయుటకై పనిలో ఉండాలని మాదిగల ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసిన గొప్ప నేత అలాంటి నాయకుడి రాకను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ ఎమ్మార్పీఎస్ నాయకులు ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షులు మంద సుజాత మాదిగ,బెజవాడ బాల గురవయ్య మాదిగ,గొలపల్లి మోహన్ రావు మాదిగ,గంగపట్లసింహాద్రి మాదిగ,గోచిపాతల ఆనంద్ రావు మాదిగ,గోసాల సుధాకర్ మాదిగ,మొలబంటి సుధాకర్ మాదిగ,కొడవటికంటి రాజ్ కిరణ్ మాదిగ,చెరుకూరి వెంకటేష్ మాదిగ, పాజర్ల తిరుపాలు మాదిగ,బర్రె అర్జున్ మాదిగ,కంచుపాటి భాగ్యరాజ్ మాదిగ,గంగపట్ల వెంగళరావు మాదిగ,పేముల మాల్యాద్రి మాదిగ,కె రాజయ్య మాదిగ,సిహెచ్ రాకేష్ మాదిగ,నియోజకవర్గంలోని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







