ఏసీబీ వలకు చిక్కిన ఏలేశ్వరం నగరపంచాయతీకమిషనర్, డేటా ఎంట్రీ ఆపరేటర్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏసీబీ వలలో ఏలేశ్వరం కమిషనర్
కమీషన్ల కోసం కాంట్రాక్టర్ ని వేధిస్తున్న కమిషనర్ పై రాజమండ్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపల్ కాంట్రాక్టర్ తొండారపు రాజబాబు మున్సిపల్ కి సంబంధించిన కాంట్రాక్టు పనులు నిర్వహిస్తాడు.తను చేసిన పనుల నిమిత్తం రావాల్సిన సొమ్ము కోసం కమిషనర్ ని అడుగగా లంచం కోసం వేధిస్తుండడంతో రాజమండ్రి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.ఫిర్యాదు అందుకున్న అవినీతి నిరోధక శాఖ డిఎస్పి కిషోర్ బాబు తమ సిబ్బందితో వలపన్నారు.ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయం కంప్యూటర్ డేటా ఆపరేటర్ గుసిడి అరుణాచలం అనే వ్యక్తి 23 వేల రూపాయలు తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఏసిబి డిఎస్పి కిషోర్ బాబు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి 2017 సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన బిల్లుకు సంబంధించిన 6 లక్షలు విడుదల చేయగా ఇంకా 7.25 లక్షలు రావాల్సి ఉంది. అలాగే 2015లో సామాజిక ఆరోగ్య కేంద్రం భవనం నిర్మాణానికి సంబంధించి ఒక లక్ష రూపాయలు రావాల్సి ఉంది.ఈ రెండు పనుల నిమిత్తం సొమ్ము విడుదల చేసేందుకు నగర కమిషనర్ ఎం సత్యనారాయణ మూడు శాతం చొప్పున 23 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు పేర్కొన్నార న్నారు. తమ సిబ్బందితో వలపన్ని అవినీతికి కమిషనర్ ఎం సత్యనారాయణ ను, ఆయనకు సహకరించిన అరుణాచలమును అదుపులో తీసుకొని జ్యూడిషియల్ కస్టడీకి పంపుతామన్నారు. అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగిన అవినీతికి పాల్పడిన తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా డిఎస్పి కిషోర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట సబ్ ఇన్స్పెక్టర్లు వై సతీష్, ఎంవి భాస్కరరావు సిబ్బంది తదితరులు ఉన్నారు.

  • Related Posts

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ రిపోర్టర్ పసుమర్తి జాలయ్య:- సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ హాలులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి మరియు మత్స్య…

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ, రిపోర్టర్ పసుమర్తి జాలయ్య :- సింగరాయకొండ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం అమల్లో భాగంగా, 10 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల (సంకల్ప)లో భాగంగా పాకల గ్రామం జడ్పీహెచ్ఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    • By JALAIAH
    • September 10, 2025
    • 2 views
    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    • By RAHEEM
    • September 10, 2025
    • 8 views
    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 9 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ