

.మన న్యూస్, నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ని పొట్టేపాళెం గ్రామంలో కోటి 25 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పనిచేసే కలెక్టర్ నెల్లూరు జిల్లాలో ఉండడం సంతోషం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పొట్టేపాలెం గ్రామ అభివృద్ధికి నిధుల లభ్యతనను బట్టి నిధులు కేటాయిస్తాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నాకు తెలియని విషయాలు కూడా చెప్పి నిధులు ఎక్కడ ఉన్నాయి, ఎలా తీసుకురావాలో సలహా ఇస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి నా కృతఙ్ఞతలు అని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అన్నారు.పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్, టీడీపీ నాయకులు ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, టిడిపి మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇంచార్జి వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి,సర్పంచ్ ఏడుకొండలు, ఎంపీటీసీ నేరెళ్ల నారాయణ, జడ్పీ కో ఆప్షన్ మెంబెర్ అల్లాబక్షు, టీడీపీ నాయకులు పొన్నాల రామచంద్రా రెడ్డి, ఏటూరి శ్రీనివాసులు రెడ్డి, చెన్నారెడ్డి సురేష్ రెడ్డి, చెన్నారెడ్డి అశోక్ రెడ్డి, సతీష్ రెడ్డి, కందల హరి, జనార్దన్ రెడ్డి, దువ్వూరు జనని బాబు,ముత్యాల సుబ్రహ్మణ్యం, బాలకృష్ణ, పెంచలయ్య, సురేష్, నవాజ్, నరసింహ, ఫిరోజ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

