బీ కేర్ ఫుల్.. యాత్రల పేరుతో ఘరానా మోసం

Mana News :-  ఉప్పల్ లో యాత్రల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్ కుమార్ పుణ్య క్షేత్రాల పేరుతో ఆఫర్స్ ప్రకటించి కోట్లలో వసూళ్లకు పాల్పడ్డాడు. మానస సరోవరం ఇతర టూర్స్ పేరిట సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేశాడు. ఐదేళ్లుగా రూ.15 కోట్లు వసూలు చేసినట్లుగా గుర్తించారు అధికారులు. దాదాపు 500 మందికిపైగా బాధితులు ఉన్నారు. బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. భరత్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బాధితులు ఉన్నారు. అమెరికా నుంచి బాధితులు ఉన్నారు. తన అసిస్టెంట్ డబ్బులు ఎత్తుకెళ్లిపోయాడని అతడి మీద నెపం వేయాలని భరత్ కుమార్ చూశాడు. ఇంతలో అలర్ట్ అయిన అసిస్టెంట్.. మా అందరిని కలిపి ఒక గ్రూప్ చేశాడు. ఆఫీస్ నుంచి డేటా తీసుకుని వచ్చి గ్రూప్ ను ఫార్మ్ చేశాడు. అలా చేయడం వల్లే ఇంతమంది బాధితులం ఉన్నామని మాకు తెలిసింది. లేదంటే తెలిసేది కాదు. మానస సరోవరం చూడాలనే సంక్పలంతో నేను రూ.2లక్షలు ఇచ్చాను. పంపిస్తాను అని చెబుతూనే ఉన్నారు. ఇలా రెండున్నరేళ్లు గడిచిపోయాయి.

నేను ఒక్కడినే కాదు మరో 250 మంది వరకు రూ.2 లక్షల చొప్పున కట్టారు. కర్నాటక, తెలంగాణ, ఏపీలకు చెందిన వారి నుంచి డబ్బు తీసుకున్నాడు. కబుర్లు చెప్పాడు తప్ప మమ్మల్ని ఎక్కడికీ తీసుకెళ్ల లేదు. వీసా రాలేదని ఇచ్చి డబ్బు కంటే తక్కువ డబ్బుని కొంతమందికి ఇచ్చాడు. మేము గత మూడు నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. అందరం ఫిర్యాదులు ఇచ్చాం. కానీ, మాకు ఎలాంటి స్పందన కనిపించలేదు. పుణ్య క్షేత్రాలకు తీసుకెళ్తానని చెప్పి మా అందరినీ భరత్ కుమార్ మోసం చేశాడు” అని బాధితులు వాపోయారు. మరో ట్రావెల్ మోసం హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తామంటూ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్.. వందలాది మందిని మోసగించాడు. కోట్ల రూపాయలు వసూలు చేసి కుచ్చు టోపీ పెట్టాడు. కాగా, భరత్ పై గతంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ లోనూ మోసం చేసిన కేసు నమోదైంది. అప్పుడు భరత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన భరత్.. మరోసారి అదే దందా చేశాడు. యాత్రల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డాడు. తమకు న్యాయం చేయాలని, తమ డబ్బు తమకు ఇప్పించాలని, మాయ మాటలతో మోసం చేసిన భరత్ ను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం