

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 17: నెల్లూరులో ,పొగతోట ,సండే మార్కెట్ దగ్గర, సుబ్రహ్మణ్యం గుడి పక్క వీధి లో డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శ్రీ రత్నం హాస్పిటల్ 30 వార్షికోత్సవం సందర్భంగా భారీ ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించినారు.ఈ భారీ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ పిట్టి.మల్లికార్జునరావు( ఊపిరితిత్తులు వ్యాధి నిపుణులు) డాక్టర్ పిట్టి. వినాయక సందీప్ (ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు) డాక్టర్ పిట్టి .భారతి (కానుపులు, గర్భకోశ వ్యాధినిపుణులు) డాక్టర్ సాత్విక బొనిగి (జనరల్ ఫిజీషియన్) పాల్గొని రోగులను పరీక్షించి ,ఉచితంగా మందులు ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు మాట్లాడుతూ….. మా శ్రీ రత్నం హాస్పిటల్ స్థాపించి 30 సంవత్సరాల అయిన సందర్భంగా హాస్పిటల్లో నందు భారీ ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు నిర్వహించాము అని అన్నారు.ఈ ఉచిత వైద్య శిబిరంలో నేను,డాక్టర్ పిట్టి. భారతి, డాక్టర్ పిట్టి .వినాయక సందీప్ ,డాక్టర్ సాత్విక బొనిగి పాల్గొని రోగుల పరీక్షించి, రక్తపరీక్షలు, ఈసీజీ అవసరానికి ఎక్స్ రేలు తీయించి మందులు ఉచితంగా ఇచ్చాము ,రోగులకు ఆహారం కూడా సరఫరా చేసాము అని అన్నారు.ఈ ఉచిత శిబిరం నందు శ్రీ షిరిడి సాయి రూరల్ వెల్ఫేర్ మెడికల్ ఫౌండేషన్ వారి సహాయ సహకారముతో కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శుక్ల మల ఆపరేషన్ ఉచితంగా చేయించబడును అని అన్నారు.శ్రీ షిరిడి సాయి రూరల్ వెల్ఫేర్ మెడికల్ ఫౌండేషన్ స్థాపించి 22 సంవత్సరాలు అయింది .ఈ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము అని అన్నారు.దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్ మాట్లాడుతూ…… డాక్టర్ అంటే దేవుడితో సమానం ,మనకు ఏ ఆపద వచ్చినా డాక్టరే గుర్తుకొస్తారు, మన ప్రాణాలు కాపాడేది డాక్టరే అలాంటి వృత్తి డాక్టర్ వృత్తి అని అన్నారు. అలాంటి వృత్తి లో మా సామాజిక మిత్రుడు డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు కరోనా టైం లో సేవలు మరువలేము అని అన్నారు. మా యాదవుల్లో ప్రజా సేవ ముఖ్యమని భావించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం అని అన్నారు.బిజెపి నాయకురాలు రాజేశ్వరి మాట్లాడుతూ……. డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు, డాక్టర్ పిట్టి భారతి మరియు కుటుంబ సభ్యులతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించటం చాలా సంతోషం, అభినందనీయం అని అన్నారు. ఈరోజు పక్క వ్యక్తులను గురించి పట్టించుకునే లేని పరిస్థితుల్లో ఇలా పేదలకు అందరికీ ఉచిత వైద్య చేయడం చాలా అభినందనీయం అని అన్నారు. డాక్టర్ని వైదో నారాయణ హరి, వైద్యుని దేవుడితో పోలుస్తాము, రోగులు బ్రతకాలని సేవ చేస్తారు అని అన్నారు .ఇలాంటి కార్యక్రమాలు ప్రతి డాక్టర్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు. పిట్టి మల్లికార్జునరావు ఇంకా పెద్ద హాస్పిటల్ పెట్టి ఇంకా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను అని అన్నారు.నగర కార్పొరేటర్ సత్య మాట్లాడుతూ…… గత 30 సంవత్సరాలు నుండి ప్రతి సంవత్సరం శ్రీ రత్నం హాస్పిటల్ నందు డాక్టర్ పిట్టి మల్లికార్జున రావు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు అని అన్నారు. ఈ సేవలో డాక్టర్ పిట్టి భారతి ,కుమారుడు డాక్టర్ వినాయక సందీప్ ,డాక్టర్ సాత్విక పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించినారు అని అన్నారు .ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారి అయినా చేయడం చాలా అవసరం అని అన్నారు .డాక్టర్ అంటే దేవుడితో సమానం, దేవుడు తర్వాత ప్రాణాలు పోసేది డాక్టరే అని అన్నారు. అందరూ డాక్టర్ను గౌరవించండి, డాక్టర్ సేవలను తీసుకోండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




