

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: గత నెల 16 న అర్దాంతరంగా మూసివేసిన చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆదివారం మోకాళ్లపై నిల్చుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ గత 15 రోజులుగా అనేక విధాల ఆందోళన నిర్వహిస్తున్న యాజమాన్యం గాని, ప్రభుత్వం గాని కనీసం చర్చలు కూడా జరపలేదని ఆరోపించారు. 24 గ్రామాలకు చెందిన 409 మంది కార్మికుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని వెంటనే ఫ్యాక్టరీ తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి వీరబాబు, కే చక్రధర్, ఎం చంటి, ఎస్ జయలక్ష్మి, సిహెచ్ గోవింద్, టి.దేవి, బి అన్నపూర్ణ ఆధ్వర్యంలో పాల్గొన్నారు.