సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం మీరంతా చక్కగా చదువు కోవాలి విద్యార్థులకు పిలిపునిచ్చిన మంత్రి సంధ్యారాణి

మన న్యూస్: పాచిపెంట, నవంబర్ 29:-
పాచిపెంట లోవిద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, విద్యార్థులే దేశ భవిష్యత్తు అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.మండల కేంద్రమైన పాచిపెంట గ్రామం స్థానిక ఎంపీడీవో కార్యాలయం దగ్గర్లో నిర్మించిన బాలికల అదనపు వసతి గృహాన్ని ఆమె శుక్రవారం నాడు ప్రారంభించారు.ఒక కోటి 75 లక్షలు రూపాయలు తో నిర్మించిన భవనము ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మీరు చక్కగా చదువుకొని తల్లిదండ్రులు కన్న కలలు నిజం చేయాలని కోరారు. భోజనం బాగుంటుందా లేదని ప్రశ్నించారు. బాగుంటుందని విద్యార్థులు సమాధానం ఇచ్చారు. మీరు ఆటలు పాటలతో మానసిక శారీరకంగా ఎదుగుదల చెందాలని కోరారు. గతంలో నిలిచిపోయిన రోడ్లు, భవనాలు నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2000 రహదారులు అభివృద్ధి నిమిత్తం 2500 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. గిరిజన ప్రాంతాల నుంచి డోలీలు మోతకు (చెక్)స్వస్తి పలుకుతున్నామని, గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణం చేపట్టిన తర్వాత అవసరమైన మేరకు ఫీడర్ అంబులెన్స్లు ఉపయోగిస్తామని తెలిపారు. డోలీలు మోతలు ఇకపై ఉండవని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. హాస్టల్ విద్యార్థుల కు వరాలు కురిపించిన మంత్రి హాస్టల్స్ చదువుతున్న విద్యార్థులకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వరాల జల్లు కురిపించారు. గత ఐదేళ్లలో కాస్మోటిక్స్, ప్లేట్లు గ్లాసులు దుప్పట్లు, బెడ్ సీట్లు అప్పటి ప్రభుత్వం అందించలేదని త్వరలో అవన్నీ మీకు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆమె తెలిపారు. మెనూలో మార్పులు తీసుకొస్తుందని మంచి పౌష్టికాహారం అందిస్తమని తెలిపారు. మాకు ఆట స్థలముతో పాటు,అదనపు మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని ఒక విద్యార్థిని మంత్రిని కోరారు. విద్యార్థి మాటలకు ఆమె ఆనందం వ్యక్తం చేసి మీలో ప్రశ్నించే తత్వం మంచిదని మీకోసం ఈ ప్రభుత్వం అన్నివేళలా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని ఆమె హామీ ఇచ్చారు. కాంపౌండ్ వాల్కు ఫెన్సింగ్ వంటి ఇతర పనులు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ఆమె వెంట పార్వతీపురం ఐటీడీఏ ఈ ఈ మని రాజు, తహసీల్దార్ రవి, ఎం ఇ ఓ జోగారావు,ఏ ఇ సత్యనారాయణ, పాంచాలి సర్పంచ్ యుగంధర్,ఎంపీటీసీ ఉమా,ముఖి సూర్యనారాయణ, పూసర్ల నరసింగరావు, మాది రెడ్డి మజ్జా రావు,అలజంగి సీతారాం, నడి పల్లి బాబాకార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}
  • Related Posts

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ రిపోర్టర్ పసుమర్తి జాలయ్య:- సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ హాలులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి మరియు మత్స్య…

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ, రిపోర్టర్ పసుమర్తి జాలయ్య :- సింగరాయకొండ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం అమల్లో భాగంగా, 10 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల (సంకల్ప)లో భాగంగా పాకల గ్రామం జడ్పీహెచ్ఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    • By JALAIAH
    • September 10, 2025
    • 2 views
    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    • By RAHEEM
    • September 10, 2025
    • 8 views
    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 9 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ