ముదునూరి ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగులకు వనభోజనం

త్వరలో మురళీకృష్ణంరాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు

(మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు: కార్తీక మాసంలో కులాల వారీగా వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం చూస్తున్నాం.కానీ దానికి భిన్నంగా ప్రత్తిపాడు వైసిపి నేత మురళీ కృష్ణంరాజు మానసిక దివ్యాంగులకు, దివ్యాంగులకు వనభోజనాలు ఏర్పాటు చేసి తాను కూడా వారితో కలిసి భోజనం చేసి వారితో ఆప్యాయంగా గడిపారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం గ్రామంలో గల శాంతి వర్ధన ప్రత్యేక వికలాంగుల ఆశ్రమ పాఠశాల నందు పలువురు మానసిక వికలాంగులు, దివ్యాంగులు ఆశ్రమం పొందుచున్నారు. నియోజకవర్గ వైసిపి నేత ముదునూరి శుక్రవారం కార్తీకమాసం పురస్కరించుకుని దివ్యాంగులకు వనభోజనాలు ఏర్పాటు చేశారు. మురళీకృష్ణంరాజు వారితో కలిసి భోజనం చేసి, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముదునూరి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మానసిక వికలాంగుల పట్ల ప్రతి ఒక్కరూ ఆదరణ చూపాలని, ఈ అవకాశం దేవుడిచ్చిన వరంగా భావిస్తానని,పిల్లల మానసిక వికాసానికి కృషి చేస్తున్న శాంతి వర్ధిని సిబ్బంది సేవలు అభినందనీయమని అన్నారు.త్వరలోనే ముదునూరి మురళీకృష్ణం రాజు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నానని, ఈ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్టాల్లో పాలుపంచుకుని వారికి అండగా నిలుస్తానని తెలిపారు.ఇటీవల నియోజకవర్గంలో ముదునూరి చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలపే కార్యకర్తలు అభినందిస్తున్నారు.ఈ కార్యక్రమంలో కొండపల్లి అప్పారావు,దడాల సతీష్,బొబ్బిలి వెంకన్న, తాటిపాక కృష్ణ,రాయుడు రాజు,ఈగల రాఘవ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..