ఏకగ్రీవం కోసం సమాలోచనలు చేస్తున్న అధిష్టానం!-

గంగాధర నెల్లూరు, మన న్యూస్…ఎస్ఆర్ పురం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష రేసులో పైనేని మురళి ముందున్నట్లు గత నాలుగు నెలల పనితీరును బట్టి తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే అధిష్టానానికి పైనేని మురళి పేరు వెళ్లినట్లు పార్టీ వర్గాలు భావిస్తోంది . మండల అధ్యక్ష పదవికి పలువురు సీనియర్లు సిటిజన్ ముందుకు వస్తున్న తరుణంలో అధిష్టానం అధిష్టానం మాత్రం యువనేతకి పార్టీ పగ్గాలు ఇచ్చి… రానున్న ఎన్నికల్లో లోకేష్ బాబుకు చేయూతనిస్తే బాగుంటుందని సమాలోచనలు చేస్తుంది. పలు గ్రూపులుగా ఉన్న సీనియర్లలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పార్టీలో సంకేతాలు ఇవ్వడం జరిగింది. సీనియర్లకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెడితే, మరో వర్గం పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. అదే యువ నాయకుడును నియమిస్తే… పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడతారనే .. సందేహం… అటు ఎమ్మెల్యే… ఇతర సీనియర్ నేతలతో పాటు కార్యకర్తలు కూడా మచ్చలేని యువ నేతపైనే మొగ్గు చూపే అవకాశాలు ఉందని తెలుస్తోంది. మండలంలో సీనియర్ నేతలతో పాటు, ప్రతి వర్గం నుంచి యువ నేత, గతంలో నియోజకవర్గ ఐ టి డి పి అధ్యక్షులుగా వ్యవహరించారు. పార్టీలో క్రియాశీలకంగా యువత కోసం పనిచేశారు. ఇలాంటి తరుణంలో పార్టీ అధ్యక్షుడిగా యువ నేత అయిన పైనేని మురళి కి అవకాశం ఇస్తే… పార్టీ ఏక తాటిపైకి రావడమే కాకుండా … వర్గ పోరు తప్పుతోందని ఎమ్మెల్యేతో పాటు,, పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు గుసగుసలు వినబడుతోంది. తాటిపైకి రావడమే కాకుండా … వర్గ పోరు తప్పుతోందని ఎమ్మెల్యేతో పాటు,, పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు గుసగుసలు వినబడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *