విజిలెన్సు దాడుల్లో భారీగా అక్రమ బియ్యం పట్టివేత- సీజ్ చేసిన లోడు లారీ

మన న్యూస్, పాచిపెంట,జులై 12:- విజిలెన్స్ అధికారులు దాడుల్లో పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న పి డి ఎస్ బియ్యం పట్టుబడ్డాయి. రెవెన్యూ శాఖ వివరాలు మేరకు ప్రాంతీయ నిఘా అమలు అధికారి బి. ప్రసాదరావు ఆదేశాల మేరకు విజిలెన్స్ మరియు రెవెన్యూశాఖ అధికార్లు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి కోనవలస చెక్ పోస్ట్ వద్ద ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించు చుండగా కొత్తూరు మండలం కడుమ గ్రామం నుండి ఒడిశా రాష్ట్రం (నవరంగాపూర్) కు పిడిఎస్ బియ్యంతో నిండిన ఏపీ 39యు యు 4289 ప్రయాణిస్తున్న లారీ ను తనిఖీ చేయగా వాహనం నందు దాదాపు 15లక్షల 83వేల 400 రూపాయలు విలువ గల 34వేల 800 కిలోల బరువున్న 700 బస్తాల పిడిఎస్ బియ్యం ను కడుమ గ్రామం నకు చెందినరైస్ మిల్ ఓనర్ గోవింద రావు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు విచారణలో పైన పేర్కొన్న పిడిఎస్ బియ్యం కొత్తూరు మండలం కడుమ గ్రామంలోని తెల్ల కార్డు లబ్ధిదారుల నుండి సేకరించిన ఒడిశా రాష్ట్రంలోని నవరంగాపూర్ నందు అమ్ముతామని లారీ డ్రైవరు తెలియచేసాడు. అంతట విజిలెన్స్ అధికారులు 700 బస్తాల పిడిఎస్ బియ్యం మరియు లారీ ను స్వాధీనం చేసుకుని సిఎస్‌డిటికి అప్పగించడం జరిగినది.మరియు ఈసీ చట్టం 1955 లో ని 6(ఎ) అండ్ 7(1) సెక్షన్ల కింద గోవింద రావు మరియు మానేపల్లి వెంకటేష్ (వాహన డ్రైవర్) ల పై కేసులు నమోదు చేయమని మరియు అవసరమైన క్రిమినల్ చర్యలు తీసుకోమని సిఎస్‌డిటి కి తెలియచేయడం అయింది.పై తనిఖిలలో విజిలెన్స్ అధికారులు ఇన్స్పెక్టర్ సింహాచలం, సబ్ ఇన్స్పెక్టర్ రామా రావు, పోలీస్ కానిస్టేబుళ్లు పురుషోత్తమ, తిరుపతి రావు మరియు రెవెన్యూ శాఖ అధికారి హేమలత, పాచిపెంట సి ఎస్ డి టీ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///