

హయత్ నగర్. మన న్యూస్ :- హయత్ నగర్ లోని పాత రోడ్ అనుమగల్ శ్రీ సాయి కాలని అపోలో ఫార్మసీ ప్రక్కన భానుచందర్ నేతృత్వం లో నూతనంగా ఏర్పాటు చేసినా మాగ్నం బేక్స్ అండ్ కేక్స్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి హయత్ నగర్ సి ఐ నాగరాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు బేకారి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ బేకరి పరిసరాల్లో పరిశుభ్రత పాటిస్తూ కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీను, నాయకులు శ్రీకాంత్, అరుణ్, బీజేవైఎం అధ్యక్షులు ప్రేమ్,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు..