

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఏలేశ్వరం బాలయోగి గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ప్రత్యేక యోగాసన కార్యక్రమాన్ని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె చంద్రశారద ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.జీవితంలో యోగ ప్రాముఖ్యతను వివరిస్తూ,ఆరోగ్యంగా ఉండేందుకు యోగ ఎంతలా ఉపయోగపడుతుందో తెలియజేశారు.ప్రతి ఒక్కరూ యోగాను క్రమం తప్పకుండా జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.విద్యార్థినులచే యోగాసనాలు వేయడం ధ్యానం చేయటం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చంద్ర శారద మాట్లాడుతూ,యోగాను మన జీవితంలో భాగంగా చేసుకోవాలని తెలిపారు.యోగ వలన విద్యార్థుల్లో ఆరోగ్య స్ఫూర్తిని నింపిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది,పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.