

మన న్యూస్ నెల్లూరు:- సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా 39 మందికి లబ్ది- చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపేద ప్రజల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని విపిఆర్ నివాసంలో 39 మందికి 34 లక్షల విలువచేసే సిఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పరిధిలో 7 చెక్కుల ద్వారా రూ.12 లక్షల 8 వేలు, అలాగే కోవూరు నియోజకవర్గ పరిధిలో 32 మందికి రూ.21 లక్షల 81 వేలు అందజేశారు. ఇప్పటివరకు ఎంపీ మరియు ఎమ్మెల్యే పరిధిలో 230 మందికి 3 కోట్ల 24 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. పెద్దమొత్తంలో పేద ప్రజల వైద్యం కోసం నిధులు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు కల్పిస్తూ.. వారికి అండగా నిలుస్తోందన్నారు. సీఎంఆర్ఎఫ్ కు నమోదు చేసుకున్న వెంటనే నిధులు అందజేస్తుందని చెప్పారు. వరకు 12 విడతల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామన్నారు. ఈ నిధుల వల్ల వేలాది మంది ప్రాణాలు కాపాడగలుగుతున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బెజవాడ వంశీ రెడ్డి, ఇందుకూరుపేట మండల పార్టీ మాజీ అధ్యక్షులు వీరేంద్రనాయుడు, కొడవలూరు మండల పార్టీ అధ్యక్షులు నాప వెంకటేశ్వర్లు నాయుడు, విడవలూరు మండల పార్టీ అధ్యక్షులు ఏటూరి శ్రీహరి రెడ్డి, కోవూరు మండల పార్టీ అధ్యక్షులు కొల్లా సుధాకర్ రెడ్డి, బుచ్చి పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, బుచ్చి రూరల్ మండలాధ్యక్షులు బెజవాడ జగదీష్, బుచ్చి మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ, జనసేన నాయకులు గుడి హరి రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

