

మన న్యూస్ సర్వేపల్లి:*ఆ కుటుంబంలో అందరూ ప్రజల కోసం స్వార్థం లేకుండా పనిచేసేవారే*మూడు తరాల వారితో పనిచేసే అదృష్టం నాకు లభించింది.ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…….. నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచనలు ఆయనకు వచ్చాయి అని అన్నారు.రాముడు, కృష్ణుడు, అర్జునుడు అంటే ఎన్టీఆరే గుర్తుకొస్తారు..జనం గుండెల్లో ఆయన దేవుడిగా నిలిచారు అని అన్నారు.కొన్ని కుటుంబాలకే పరిమితమైన రాజకీయాన్ని అన్ని వర్గాలకు పరిచయం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని అన్నారు.ఇచ్చిన మాట ప్రకారం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేసిన నాయకుడాయన అని అన్నారు.విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఐకాన్ గా నిలుస్తోంది అని అన్నారు.వైసీపీ అరాచకాలతో ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడే పరిస్థితుల్లో లోకేష్ బాబు యువగళం పాదయాత్రతో చైతన్యం నింపారు అని అన్నారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి హోదాల్లో అటు రాజకీయంగా, ఇటు ప్రజాపాలనలో లోకేష్ బాబు సత్తా చూపిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులందరూ ప్రజాసేవలో తరిస్తున్నారు అని అన్నారు.ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం పనిచేసే కుటుంబం అది అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ, టీడీ జనార్దన్, సినీ నటుడు నారా రోహిత్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి తదితరులు.


