రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా రివార్డులను అందుకున్న జిల్లా అధికారులు

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన అధికారులను ప్రశంసించిన రాష్ట్ర డీజిపి డా. జితేందర్ ఐపిఎస్ పోలీస్ స్టేషన్లో గంజాయి అక్రమ రవాణా కేసుల్లోని నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన సీఐ నాగరాజు రెడ్డి,ఎస్సై శ్రీకాంత్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ సుధీర్ లకు ఈ రోజు రాష్ట్ర డీజిపి డా.జితేందర్ ఐపిఎస్ తమ కార్యాలయంలో రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా డిజిపి చేతుల మీదుగా అరువార్డులను అందుకున్న అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.2023 సంవత్సరంలో ప్రభుత్వం నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేవిధంగా కృషి చేసిన అప్పటి ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి,ఎస్సై శ్రీకాంత్ , కోర్టు డ్యూటీ ఆఫీసర్ సుదీర్ లు శనివారం డీజీపీ కార్యాలయంలో రివార్డులను అందుకున్నారు. సిఆర్. నెం.169/2023, భద్రాచలం పిఎస్ లో 480 కిలోల నిషేధిత గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు ముద్దాయిలకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష , ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా సి ఆర్ . నెం.198/2023, భద్రాచలం పిఎస్ 484 కిలోల నిషేధిత గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు ముద్దాయిలకు 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష , ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా పడేవిధంగా కోర్టు వారికి సాక్షాధారాలను సమర్పించి సమర్థవంతంగా పనిచేసినందుకు గాను వీరి ప్రతిభను గుర్తించి ఇట్టి రివార్డులను అందజేయడం జరిగింది. వీరి ముగ్గురితో పాటు నేరస్తులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయకుమార్ ని కూడా జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

    బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

    ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*