

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని హాస న్ పల్లి గ్రామ శివారులోని పిప్పి రేగడి సమీపంలో నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.స్థానికుల కథనం ప్రకారం.. మధుకర్ గౌడ్ (ఎల్లారెడ్డి), నవీన్(తిమ్మారెడ్డి), హర్ష (సోమర్ పెట్ ) సోమవారం క్రికెట్ ఆడేందుకు వెళ్లారు.అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతయ్యారు. గ్రామస్థుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..