ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో వద్ద విషాదం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత

మన న్యూస్,నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) క్రికెట్ ఆడి ఎండవేడిమి తట్టుకోలేక నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు సోమవారం గల్లంతయ్యారు. బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం ..ఎల్లారెడ్డి మండలానికి చెందిన పది మంది యువకులు సోమర్ పేట్ సమీపంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, అలసిపోయిన యువకులు సేదతీరేందుకు మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులో పిప్పిర్యాగడి తండా నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఈత కొట్టాలని నిర్ణయించుకున్నారు.అయితే ప్రమాదవశాత్తు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోతు అంచనా వేయలేకపోవడం వల్ల ముగ్గురు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. యువకులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్ ,పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు.రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలించగా మంగళవారం ఉదయం ఒక మృతదేహం మధ్యాహ్నం సమయంలో రెండు మృతదేహాలను వెలికి తీశారు.మొత్తం ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన మధుకర్ గౌడ్ (18), తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ (25), సోమర్ పేట్ గ్రామానికి చెందిన హర్షవర్ధన్(17)గా గుర్తించారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లభ్యమైన ముగ్గురు యువకుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్,ఎస్ఐ శివకుమార్ తెలిపారు. సంఘటన స్థలానికి మాజీ జెడ్పిటిసి గయాజుద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయిబాబా, నాయకులు సామెల్, విద్యాసాగర్ తదితరులున్నారు,

  • Related Posts

    బక్రీద్ పండుగ వేడుకలు

    మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శనివారం బక్రీద్ పండుగ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఉదయం నూతన వస్త్రాలను ధరించి గ్రామాల్లోని ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజులు చదువుతారు.ఈద్గాల వద్ద మత గురువులు ఇమాంలు ముందుండి…

    ఘనంగా ఎనుముల కొండల్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చంపాపేట్. మన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కొండల్ రెడ్డి జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కబడ్డీ చైర్మన్ తుమ్మలూరు మాజీ సర్పంచ్ మద్ది కర్ణాకర్ రెడ్డి చంపాపేట్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    బక్రీద్ పండుగ వేడుకలు

    • By RAHEEM
    • June 8, 2025
    • 3 views
    బక్రీద్ పండుగ వేడుకలు

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

    నెల్లూరులో చివరి దశకు చేరుకున్న విఆర్ హైస్కూల్ ఆధునికరణ పనులు

    నెల్లూరులో చివరి దశకు చేరుకున్న  విఆర్ హైస్కూల్ ఆధునికరణ  పనులు

    నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి

    నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్ గా విఆర్ హైస్కూల్ ఉండబోతుంది…….. పొంగూరు షరీణి