

మన న్యూస్, నెల్లూరు: నెల్లూరు పడారుపల్లి వికలాంగుల కాలనీలో వై సి పి జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాస రావు (RSR) మాతృ మూర్తి పద్మావతమ్మ పార్థివ దేహానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్& ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రశేఖర్ రెడ్డి భగవంతుని ప్రార్థించారు.వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ఆకాంక్షించారు.


