

మన న్యూస్ ,నెల్లూరు :* నెల్లూరులో రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వెల్లడి * మైపాడు సెంటర్లో 200 షాపులు * బ్యాంకుల ద్వారా రెండు లక్షల రూపాయలు మంజూరు చేయిస్తాం* సొంత నిధుల ద్వారా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తా* ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా చూడాలనదే నా లక్ష్యం* మంత్రి నారాయణ ప్రకటనతో కృతజ్ఞతలు తెలిపిన మెప్మా మహిళలుమహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు అనుగుణంగా ప్రభుత్వం వారికీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. తన క్యాంపు కార్యాలయంలో మెప్మా మహిళలతో అయన సమీక్ష సమావేశం నిర్వహించారు.. స్మార్ట్ సిటీగా ఉన్న నెల్లూరులోని మైపాడు సెంటర్లో 200 షాపులకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బ్యాంకు ద్వారా రెండు లక్షల రూపాయలు మంజూరు చేయిస్తామన్నారు. అయితే ప్రతి మహిళకు తన వంతు కూడా ఒక లక్ష రూపాయలు సాయం చేస్తానని మంత్రి మంత్రి నారాయణ ప్రకటించారు.మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఈ షాపులు కేటాయిస్తున్నట్లు చెప్పారు.ప్రతి ఇంటి నుంచి ఓ మహిళను పారిశ్రామికవేత్తగా చేయాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు.20 రోజుల్లో స్మార్ట్ సిటీని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. తమ వ్యాపార అభివృద్ధికి రెండు కోట్ల సొంత నిధులు ప్రకటించిన మంత్రికి మెప్మా మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ లీలా రాణి,మెప్మా అధికారులు పాల్గొన్నారు.



