

మన న్యూస్ ,నెల్లూరు :- పాఠశాలను దత్తత తీసుకున్న డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వారిని అభినందించిన మంత్రి – జూన్ 12 లోపు పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు- ప్రభుత్వ తోడ్పాటుతో పాటు దాతల సహకారంతో అభివృద్ధి దిశగా సర్కారు బడులు – మంత్రి నారాయణతో ఫోటోలు తీసుకునేందుకు పోటీపడ్డ విద్యార్థులు, మహిళలు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని మూలాపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం నగరపాలక సంస్థ కమీషనర్ నందన్ తో కలిసి పరిశీలించారు. పాఠశాలలో తరగతి గదుల స్థితిగతులపై ఆరా తీశారు. నిరుపయోగంగా మారిన హెడ్ మాస్టర్ రూం ను మంత్రి పరిశీలించారు. పాఠశాలను దత్తత తీసుకొని ఆధునీకరించేందుకు ముందుకొచ్చిన డీఎస్ఆర్ కనస్ట్రక్షన్స్ వారిని మంత్రి అభినందించారు. ప్రభుత్వ తోడ్పాటుతో పాటు దాతల సహకారంతో సర్కారు బడుల రూపురేఖలు మారనున్నాయని మంత్రి తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్ఆర్ కనస్ట్రక్షన్స్ ప్రతినిధులకు మంత్రి నారాయణ పలు సూచనలు చేశారు. పాఠశాలలో పది తరగతి గదులు, ల్యాబ్ & మ్యూజిక్ రూములు, ప్లే గ్రౌండ్ పనులు తొలుత ప్రారంభించాలని మంత్రి వారికి సూచించారు. జూన్ 12 కల్లా పెయింట్లతో సహా పనులు పూర్తి అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. నిరుపయోగంగా ఉన్న హెడ్ మాస్టర్ రూం ని తొలగించాలని సూచించారు. ఈ క్రమంలో మూలపేట పాఠశాలను పరిశీలించేందుకు వచ్చిన మంత్రికి స్థానిక ప్రజలు టిడిపి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి నారాయణతో ఫోటోలు దిగేందుకు విద్యార్థులు, మహిళలు ఉత్సాహంగా పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ..డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్థానిక టీడీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.



