
మన న్యూస్ ,నెల్లూరు:యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న నెల్లూరు వీఆర్సీ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. భవిష్యత్ తరాల విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని సంకల్పంతో రూ.15 కోట్ల వ్యయంతో సిద్దమౌతున్న సరస్వతీ నిలయాన్ని మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలలో ఎక్కడ రాజీ లేకుండా పనులు చేస్తున్న ఎన్సీసీ కంపెనీ ప్రతినిధులను ఆయన అభినందించారు. ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ కోర్ట్ లా డిజైన్ ను పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ….. నెల్లూరు నగర నడిబొడ్డులో ఉన్న విఆర్సీలో చదివిన చాలా మంది ఉన్నతస్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. ఎందరో ప్రజాసేవకులను ఈ కళాశాల సమాజానికి అందించిందన్నారు. 2014 లో తాను.. తన సిబ్బందితో కలిసి 300 మందికి ఐఐటీ కోచింగ్ ఇక్కడే ఇప్పించానని గుర్తు చేసుకున్నారు. అయితే అలాంటి వీఆర్ సి స్కూల్ ను అవగాహన రాహిత్యంతో గత ప్రభుత్వం మూసేసిందని విచారం వ్యక్తం చేశారు. గతపాలకులకి పరిపాలనలో పక్వత లేదని ఎద్దేవా చేశారు. అసమర్ధ పాలనతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అధోగతి పాలు చేసారని మంత్రి నారాయణ మండిపడ్డారు. పది లక్షల కోట్ల అప్పును ప్రజలనెత్తిన గత ప్రభుత్వం వేసిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా సుపరిపాలన వైపు ముందుకు దూసుకెళ్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 20 లక్షలమందికి ఉద్యోగాలు కల్పించాలని యువనేత లోకేష్ సంకల్పించారని తెలిపారు. ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని మంత్రి పిలుపునిచ్చారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీని ఎంఎస్ఈ మార్చి 25 వేల మందికి ఉపాధి కల్పించబోతున్నామని వెల్లడించారు. అదేవిధంగా వీఆర్ హైస్కూల్ పునః ప్రారంభానికి మంత్రి లోకేష్ అనుమతి ఇచ్చారని తెలియజేశారు. భారతదేశంలోనే నంబర్ వన్ స్కూల్ గా తీర్చిదిద్దబోతున్నామని మంత్రి నారాయణ ఘంటాపధంగా చెప్పారు. వెయ్యి మంది నిరుపేద విద్యార్థులకు అడ్మిషన్ కల్పిస్తామని తెలియజేశారు. ఈ క్రమంలో ఇప్పటికే 760 మంది పేద విద్యార్థులను గుర్తించామన్నారు. విఆర్సీలో చదివే విద్యార్థుల్లో కొన్ని కుటుంబాలను నా కుమార్తెలు, అల్లుళ్ళు దత్తత తీసుకొంటున్నారని వెల్లడించారు. P4 కింద మరికొందరిని దత్తతకు ఆహ్వానిస్తామన్నారు. Dsr కంపెనీ అధినేత సుధాకర్ రెడ్డి గుంటబడిని దత్తత తీసుకోవడం సంతోషదాయకమన్నారు. వీఆర్సీ కి ధీటుగా గుంటబడిని తయారు చేస్తామని మంత్రి వెల్లడించారు. నెల్లూరు సిటీ లో ఉన్న 54 ప్రభుత్వ పాఠశాలాలను కూడా మోడల్ స్కూల్స్ గా తయారు చేస్తామని తెలియజేశారు. తద్వారా రానున్న కాలంలో విద్యాప్రమాణాలు మరింత మెరుగు పరుస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు.అనంతరం నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశం లో ఎక్కడా లేని విదంగా వీఆర్ స్కూల్ ను మంత్రి పొంగూరు నారాయణ అభివృద్ధి చేస్తున్నారన్నారు. కడు నిరుపేద విద్యార్ధుల కోసం మంత్రి నారాయణ చేస్తున్న కృషి అనిర్వచనీయం కొనియాడారు. మూడు పూటలా ఆహారంతో పాటు వారికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నారని తెలిపారు. మంత్రి నారాయణ ఆలోచనతో వేల మంది పేద విద్యార్ధుల తల రాతలు మారబోతున్నాయని చెప్పారు. వీఆర్ స్కూల్ లో ఎంతో మంది చదువుకున్న చరిత్ర ఉందన్నారు. మంత్రి కుమార్తె షరణి కి స్కూల్ పూర్తి బాధ్యతలను అప్పగించడం అభివృద్ధిని స్వాగతించడమేనని రూప్ కుమార్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ తో పాటు కమిషనర్ నందన్ ..డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.. 45వ డివిజన్ ప్రెసిడెంట్ సుజన్.. 44వ డివిజన్ ప్రెసిడెంట్ ఏడుకొండలు..45 వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి.. బూత్ కన్వీనర్ కార్తిక్ టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.