

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) బ్యాంకులకు రాజీవ్ యువ వికాసం జాబితాను పంపించినట్లు ఇన్చార్జి ఎంపీడీవో అనిత అన్నారు.ముహమ్మద్ నగర్ మండలంలోని 13 గ్రామపంచాయతీలలో మొత్తం 749 దరఖాస్తు రాగా, 182 మంజూరైనట్లు ఎంపీడీవో అనిత తెలిపారు.రిజర్వేషన్ల ప్రకారం ఎస్టీ 183, ఎస్సి 27, బిసి 465, ఈ బీసీ 12 మైనారిటీ 55, క్రిస్టియన్స్ 04, కాగా,మొత్తం 182 మంది లబ్ధిదారులకు అర్హత ప్రకారం, బ్యాంకు రుణాలు మంజూరు చేస్తారని తెలిపారు.దరఖాస్తులు మొత్తం బ్యాంకుకు పంపినట్లు అర్హులైన లబ్ధిదారులకు మంజూరుకగా వారికి తెలియజేస్తామన్నారు.