

మన న్యూస్, నెల్లూరు:*లైంగిక వేధింపులను ఇక పై అస్సలు సహించరాదు.*విచ్చలవిడితనాన్ని కట్టడి చేయడానికి పోలీసు యంత్రాంగం తో పాటు కుటుంబ సభ్యుల సహకారం కూడా అవసరంకడప జిల్లాలో మైలవరంలో ఐదు రోజుల కిందట అభం శుభం తెలియని చిన్నారిని కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగం ను కఠినంగా శిక్షించాలని కోరుతూ జనసేన పార్టీ జిల్లా కార్యాలయం,గోమతి నగర్ లో జిల్లా పర్యవేక్షకులు చైర్మన్ వేములపాటి అజయ్ సూచనతో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.అనంతరం జీరో టాలరెన్స్ ఫర్ సెక్సువల్ వైలెన్స్ అనే ప్లకార్డులను జనసేన నాయకులు ప్రదర్శించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ…………జంతువు నుండి మనిషి వచ్చారన్నమాట అందరికీ తెలిసిందే…కానీ మనుషుల్లో ఇంకా క్రూర మృగాలు బతికే ఉన్నాయనిది సత్యం అని అన్నారు.మూడు సంవత్సరాల పసికందుపై అమానుషంగా అఘాయిత్యం చేసి హత్య చేసిన ఆ క్రూర మృగాన్ని కఠినంగా శిక్షించాలి అని అన్నారు.ఈ అఘాయిత్యం చేసింది తమ సమీప బంధువు అవటం మరి ఘోరమైన విషయం అని అన్నారు. ఇటువంటి అకృత్యాలు ఇంకా జరుగుతున్నాయంటే చట్టం నుంచి తప్పించుకోవచ్చు అనే భావన ఇంకా కొంతమందిలో మిగిలి ఉంది అనిపిస్తుంది అని అన్నారు.సభ్య సమాజం తలదించుకునే విధంగా జరిగిన ఈ అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం… అని అన్నారు.ఫోక్సో కేసు కట్టినప్పటికీ కఠినంగా శిక్షలు సత్వరమే అమలు చేసి తిరిగి ఇటువంటి చర్యలు పునరావడం కాకుండా చూడాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం అని అన్నారు.ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు పూర్తిగా సమూలంగా నాశనం చేసే వరకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం అని అన్నారు.సమాజంలో తల్లిదండ్రులు ఆడపిల్లలకి ఎలా సంస్కారం నేర్పస్తారో అలాగే మగబిడ్డలకు కూడా సాటి మహిళలతో ఏవిధంగా బిహేవ్ చేశాయని అనే సంస్కారాన్ని నేర్పాలి అని అన్నారు.అభం శుభం తెలియని పసిపిల్లలకు చిన్ననాటి నుంచి ఇటువంటి క్రూరంగా నుంచి దూరంగా ఉండేటట్లుగా వారిని వారికి శిక్షణ ఇవ్వాలి అని అన్నారు.పశువు లాగా ప్రవర్తించిన ఇలాంటి మృగాలకు ఎంత కఠిన శిక్షలు అమలుపరిచిన తక్కువే అని అన్నారు.ముఖ్యంగా కొంతమందికి విచ్చలవిడితనం పెరిగిపోయింది ఏం చేసినా చట్టం నుంచి తాము తప్పించుకోవచ్చని బరితెగింపే దీనికి కారణం అనుకోవచ్చు అని అన్నారు.ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఎక్కువగా హత్యలు ఇక్కడే జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి కేవలం 40 వేల రూపాయలకి బయట ఊరికి వెళ్లి హత్య చేసి వస్తున్నారంటే ఈ గడిచిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో హింస ఎంత పెరిగిపోయింది అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.అదే విధంగా గంజాయి కేసు రోజుకు ఒకటి వెలుగులోకి వస్తున్నాయి అని అన్నారు.కొంతమంది నాయకులు వారి స్వప్రయోజనాల కోసం 25 వ సంవత్సరం దాటని పిల్లలను గంజాయికి మత్తు పదార్థాలకు అలవాటు చేసి అసాంఘిక కార్యక్రమాలకు వాడుతున్నారన్నది నిజం అని అన్నారు.కత్తులతో తిరగాల్సిన అవసరం యువతకి ఎందుకు వచ్చిందో ఇప్పటికే అర్థం కాని పరిస్థితి అని అన్నారు.తల్లిదండ్రులు కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉంది,జిల్లా పోలీసు యంత్రాంగం డ్రోన్లు ఎగుర వేసి ప్రైవేటు నిఘాలుగా ఏర్పడి ఎంత అదుపు చేయాలని ప్రవర్తించినా ఇంకా అదుపు కాని పరిస్థితి అని అన్నారు.ఒకసారి రౌడీయిజానికి గాని హత్యలకు గానీ ఇటువంటి కానీ లైంగిక వేధింపులు కానీ చేస్తే ఒక వారి జీవితకాలంలో సగం జీవితం శిక్షకే సరిపోతుందని తిరిగి వచ్చేసరికి ఇక్కడ ఏమి ఉండదు అన్న విషయాన్ని వారు తెలుసుకోవాలని చెప్పారు అని అన్నారు.ఇటువంటి చర్యలు పనురావృతం కాకుండా సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత చట్టానికే కాకుండా ప్రతి పౌరుడికి ఉంది అని అన్నారు.ఒకసారి ఏదైనా క్రైమ్ చేస్తే బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ మీరు చేసిన తప్పు నిర్ధారించబడిన తర్వాత సంవత్సరాల కాలం మీరు ఖైదీలుగా చెరసాలలో నివసించవలసి వస్తుంది అని అన్నారు.తిరిగి వచ్చేసరికి జీవితం ఏమీ కనపడదు మీ విచ్చలవిడతనానికి మీ కుటుంబం కూడా బలి అవుతుంది అన్న సత్యాన్ని గమనించాలి అని అన్నారు.చిన్ని తల్లి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆ పసువు కు కఠినంగా శిక్షలు అమలుపడాలి అని అన్నారు.మరే ఇతర పసువు కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా కఠినంగా సత్వరమే శిక్షణ అమలు పరచాలని కోరుకుంటున్నాం అని తెలిపారు అని అన్నారు.
