

శంఖవరం మన న్యూస్ (అపురూప్): పారిశ్రామిక రంగంలోనూ, పత్రికా రంగంలోనూ తనదైన ముద్ర వేసిన గొర్లి నాగేశ్వరరావు తన వివాహ దినోత్సవాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరియు రాజకీయ ప్రముఖులతో కలిసి అద్భుతంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ వ్యక్తిగతంగా హాజరై పుష్పగుచ్ఛం అందించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
గొర్లి నాగేశ్వరరావు పారిశ్రామికవేత్తగా మాత్రమే కాకుండా, జనసేన పార్టీలో విశేష సేవలందిస్తున్న నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. డివిజనల్ రైల్వే సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఆయన చేసిన కృషి గణనీయమైనదిగా పేర్కొనాలి. పారిశ్రామిక అభివృద్ధితో పాటు ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి కూడా ఆయన నిరంతరం కృషి చేస్తూ వస్తున్నారు.ఈ శుభదినాన్ని పురస్కరించుకుని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, “గొర్లి నాగేశ్వరరావు సేవాతత్పరత, కృషి, సామాజిక స్పృహతో ప్రతీ పనిలో ముందుండే వ్యక్తి. వారి వివాహ దినోత్సవం సందర్భంగా వారికి దీర్ఘాయుష్షు, ఆనందం మరియు విజయాల జీవితాన్ని కోరుకుంటున్నాను,” అన్నారు.
ఈ సందర్భంగా పలువురు వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, రాజకీయ నాయకులు కూడా నాగేశ్వరరావు కి శుభాకాంక్షలు తెలియజేశారు.