

మన న్యూస్, నెల్లూరు:*మే 27, 28 న నెల్లూరుజిల్లా నుంచి 1935 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొంటారు. *బహిరంగ సభలో జిల్లా నుంచి 45 వేల మంది పాల్గొంటారు.*మహానాడు కేవలం పార్టీ నాయకులకే కాదు. యావత్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన దినం.*మహానాడులో పాల్గొనే వారి కోసం రవాణాతో పాటు అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నాయి.నెల్లూరు నగరంలో సోమవారం ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29 న జరిగే రాష్ట్ర మహానాడు కి నెల్లూరు పార్లమెంటు ప్రజలకు స్వాగతం సుస్వాగతం తెలిపారు. మహానాడు కేవలం టిడిపి నాయకులకు కార్యకర్తలకు మాత్రమే కాదని యావత్ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన ముఖ్యమైన రోజని తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కొరకు పలు ముఖ్యమైన నిర్ణయాలు మహానాడులో తీసుకుంటారని పేర్కొన్నారు. 27, 28 తేదీల్లో పార్టీ ప్రతినిధుల సమావేశం, పలు తీర్మానాలు ప్రవేశపెడతారని తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ నుంచి 1935 మంది ప్రతినిధులు మొదటి రెండు రోజుల మహానాడు కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. మే 29 వ తేదీ నాడు జరిగే బహిరంగ సభలో నెల్లూరు పార్లమెంట్ నుంచి 45 వేల మంది పాల్గొంటారని తెలిపారు. టిడిపి నాయకుల కోసం కార్యకర్తల కోసం ప్రజల కోసం రవాణా తో పాటు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి ఉన్నారని అన్నారు.
