జేమ్స్ ను అపహరించిన వ్యక్తిని అరెస్టు చేయాలి..

  • ప్రత్తిపాడు నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు అపురూప్ డిమాండ్..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : ఆదిమ సమాజంలో ఉన్నామా? ఆధునిక సమాజంలో ఉన్నామా? దళితులను కొట్టి మూత్రం త్రాగిస్తారా? ఇలాంటి సంఘటనలను చూస్తూ ఊరుకోమంటరా? అంటూ ప్రత్తిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు గునపర్తి అపురూప్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తిరుపతిలో ఇంజనీరింగ్ విద్యార్థి జేమ్స్ ను అపహరించి, తీవ్రంగా గాయపరిచి, నోట్లో మూత్రం పోసి తాగిస్తే, నిందితులు ఏ పార్టీకి చెందిన వారు, ఏ నాయకుడి అనుచరులు అనే విషయంపై చర్చలు చేయటం, ట్వీట్ చేయటం, ఫోటోలు విడుదల చెయ్యకపోవడం ప్రభుత్వానికి సిగ్గు చేటు చర్యగా అభివర్ణించారు. ఒక్కొక్కడిని బహిరంగంగా అరెస్టు చేసి, మీడియా ముందు నిలబెట్టి, జైలుకు పంపాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ పాలనలోని మూత్ర విసర్జన సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే, అది ప్రభుత్వానికి అగౌరవమని, చాలా ప్రమాదకరం అన్నారు. నిందితులందరినీ అరెస్టు చేయాలని, జేమ్స్ ను హోం మంత్రి స్వయంగా వెళ్లి పరామర్శించాలని కోరారు. ఇలాంటి సంఘటనలను దళిత సమాజం చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా హెచ్చరించారు. బహుజనుల పక్షాన బహుజన సమాజ్ పార్టీ పోరాడుతుందని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్కు పరిపాలన కొనసాగుతుందని, అతి త్వరలో బహుజనులు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రాజ్యాంగ బుక్కును అమలు చేస్తారని అన్నారు.

  • Related Posts

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు