

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్:
రాష్ట్ర ఎస్టి సెల్ కమీషన్ కమిటీ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డిని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా పూర్వ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్,కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఉమ్మిడి వెంకట్రావు ఆధ్వర్యంలో రంపచోడవరంలో బిజెపి నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జనరల్ సెక్రెటరీ, ప్రత్తిపాడు నియోజకవర్గ బిజెపి ఇంచార్జి మట్టా మంగ రాజు,జిల్లా భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ కామినేని జయశ్రీ ,రంపచోడవరం బిజెపి కన్వీనర్ ఈకబొల్లి కొండల దొరరెడ్డి,బిజెపి నాయకులు గోకవరం రెడ్డి వారితో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ప్రత్తిపాడు నియోజకవర్గంలో పెదమల్లాపురంని ప్రత్యేక ట్రైబుల్ మండలంగా ప్రకటించాలని,ప్రత్తిపాడు నియోజకవర్గ ట్రైబుల్స్ తరుపున ఆయనని నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లాఎస్టి సెల్ చైర్మన్ కించి జోగిరాజు,ప్రత్తిపాడు మండల ఎస్టి సెల్ అధ్యక్షులు దొంతంశెట్టి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.