

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 19:*కిక్కిరిసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం.*జనంకి జవాబుదారీగా ఉందాం.*కష్టం చేసే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా.*నిరంతరం ప్రజలమధ్యలోనే ఉందాం.*నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు.*పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.*జ్యోతిప్రజ్వలన చేసి పార్టీ జెండా ఆవిష్కరించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మినీ మహానాడులో అభివృద్ధి పనులపై 12 ప్రతిపాదనలు చేసిన టీడీపీ నేతలు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తల శ్రమతోనే టీడీపీ గెలుపు సాధ్యమైంది. చరిత్రలో నిలిచిపోయేలా నన్ను నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.చంద్రబాబు పాలనలో సింహపురికి మంచిరోజులు వచ్చాయి. రాష్ట్రానికి ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆపద్బాంధవుడిగా మారారు. అయన పాలనలో అన్ని వ్యవస్థలూ గాడిన పడతాయి అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.జనంకి జవాబుదారీగా ఉందాం ,కష్టం చేసే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా, నిరంతరం ప్రజలమధ్యలోనే ఉందాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.భవిష్యత్తులో నెల్లూరు రూరల్ కు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వస్తుంది అని చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జులు, కో క్లస్టర్ ఇంచార్జులు, కార్పొరేటర్లు, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

