విజయవాడ లో డిసెంబర్ 4న ప్రజా హక్కుల సభ’ను విజయవంతం చేయండి

Mana News:- ఏలేశ్వరం మన న్యూస్ ప్రతినిధి విజయవాడ జింఖానా గ్రౌండ్ లో డిసెంబర్ 4న సీపీఐ,(ఎం.ఎల్.) లిబరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘ప్రజా హక్కుల సభ’ను విజయవంతం చేయాలని కోరుతూ లిబరేషన్ కార్యకర్తలు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీ మండలంలోని భద్రవరం, లింగంపర్తి, ఏలేశ్వరం, ఎర్రవరం, పెద్దనాపల్లి మీదుగా కొనసాగింది. ఆయా గ్రామాల్లో జరిగిన బహిరంగ సభల్లో లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు బుగత బంగార్రాజు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాన్ని విమర్శిస్తూ అందలం ఎక్కిన కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతాను మూటకట్టుకుందని విమర్శించారు. సూపర్ 6 పేరుతో జనాకర్షక పధకాలను వాగ్దానం చేసిన టీడీపీ, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. కార్పొరేట్ బాసుల నమ్మిన బంటు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. పేద మద్య తరగతి ప్రజలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళలు, యువత అనుభవిస్తున్న వాస్తవ సమస్యలపై ఆరు డిమాండ్లు లేవనెత్తి పీపుల్స్ సిక్స్ పేరుతో లిబరేషన్ ఉద్యమం చేపట్టిందని అన్నారు. ఈఉద్యమంలో భాగంగా చేపట్టనున్న ప్రజా హక్కుల సభను విజయవంతం చేయాలని బుగత బంగార్రాజు కోరారు. ఈర్యాలీలో లిబరేషన్ పొలిట్ బ్యూరో సబ్యులు వి శంఖర్, జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు మానుకోండ లచ్చబాబు, ఏఐసిసి టి యు రాష్ట్ర కార్యదర్శి గొడుగు సత్యనారాయణ, నీరుకొండ నాగేశ్వరరావు, నాగమణి, వి రత్నం తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///